వనపర్తి : వనపర్తి జిల్లా జడ్పీ ఛైర్మన్ రాకాసి లోకనాథ్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. వైద్యుల సూచన మేరకు ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇటీవల తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా.. ఇటీవలే మాస్కు ధరించనందున వనపర్తి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి… జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డికి రూ.1,000 జరిమానా విధించిన విషయం తెలిసిందే.