మహబూబాబాద్: జిల్లాలోని గార్ల మండలం బుద్ధారం తండాలో విషాదం చోటుచేసుకుంది. డోర్నకల్లో ఓ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుద్ధారం తండాకు చెందిన వాంకుడోత్ రాజు రైల్వేలో పనిచేస్తున్నారు. సోమవారం తెల్లవారు జామున ఆయన డోర్నకల్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై పడుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే కుటుంబ కలహాలు లేదా ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలో విచారణ చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..