ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
మల్యాలలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
మల్యాల, మే1: కరోనాతో యావత్ ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుదేలయ్యాయని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ ఉద్ఘాటించారు. మల్యాల రైతు వేదికలో 27 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి కింద మం జూరైన రూ.27,03,132 చెక్కులను శనివారం ఎమ్మె ల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరంలా మారిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయనియంత్రణే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. జడ్పీటీసీ కొండపలుకుల రాంమోహన్రావు, డీటీ చిలుకల కృష్ణ, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల రాంలింగారెడ్డి, అయిల్నేని సాగర్రా వు, సర్పంచులు మిట్టపల్లి సుదర్శన్, గడికొప్పుల రమేశ్, కట్కూరి తిరుపతి, కోఆప్షన్ సభ్యులు అజహర్, ఏ ఎంసీ చైర్మన్ శ్రీనివాస్, నేతలు గడ్డం మల్లారెడ్డి, ఆగంతం వంశీ, అయిల్నేని కోటేశ్వర్రావు, మారంపల్లి నారాయణ, జోగినిపల్లి శ్రీనివాస్గౌడ్, లక్ష్మణ్ ఉన్నారు.
ఒకేసారి రెండు చెక్కులు
మల్యాలకు చెందిన మల్యాల రాజవ్వ, తాటిపల్లికి చెందిన మెట్పల్లి అమృత ఒకేసారి రెండేసి చెక్కులు అందుకున్నారు. ఇందులో మల్యాల రాజవ్వ-లస్మయ్య దంపతులకు కవల కూతుళ్లు కాగా, గతేడాది ఇద్దరికీ ఒకేసారి వివాహం జరిపించారు. మెట్పల్లి అమృత-నర్సయ్య దంపతులకు ముగ్గురు కూతుళ్లు కాగా, రెండో కూతురు సౌజన్య, చిన్నకూతురు సుప్రి యకు గతేడాది మూడు నెలల వ్యవధిలోనే పెళ్లిళ్లు జరిపిం చారు. అనంతరం వారి తల్లిదండ్రులు కల్యాణలక్ష్మి ప థకం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరయ్యాయి.