పెద్దపల్లి : రైతులకు తీవ్ర నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకురావడంతో వరి ధాన్యం కొనుగోలు చేయలేని సంకట పరిస్థితి ఏర్పడిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మపురి, పెగడపల్లి, వెల్గటూర్ మండలాల్లో పర్యటించారు. ధర్మపురిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
వెల్గటూర్ మండలంలోని పలు గ్రామాల్లో, పెగడపల్లి మండలంలోని మూడు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకొని రైతులకు ఎలాంటి నష్టం కలుగవద్దనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే ప్రక్రియను మొదలు పెట్టడంతో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
గాలి ద్వారా కరోనా చాలా ఆందోళనకరం: ఎయిమ్స్ చీఫ్
పెద్దపల్లి జిల్లాలో..కరోనాతో అటెండర్ మృతి
భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత