మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారాయని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గ్రామాల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ మహబూబ్ పాషా, జెడ్పీటీసీ ప్రియాంక, ఎంపీపీ మౌనిక, తదితరులు పాల్గొన్నారు.