మొయినాబాద్ : తెలంగాణలో రాష్ర్టంలో అత్యంత పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న చిలుకూరు బాలాజీ ఆలయాన్ని అమెరికన్ కాన్సులేట్ జనరల్ జుడిత్ రేవిన్ గురువారం దర్శించుకున్నాడు. ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ విశిష్టతను వివరించారు. ఆలయాన్ని దర్శించుకున్న విద్యార్థులకు చాలా మందికి విదేశాలకు వెళ్లడానికి వీసా వచ్చిందని, విద్యార్థులు వీసా దేవుడిగా బావిస్తారని తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న శివాలయాన్ని దర్శించుకున్నారు.
తరువాత బాలాజీ ఆలయం వెనకాల ఉన్న గోశాలను సందర్శించి అందులో కొంత సేపు గడిపారు. చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో దేశ ప్రజలు, ప్రపంచమంతా తొందరగా కొవిడ్-19 నుంచి కోలుకోవాలని ఆయన స్వామివారిని కోరుకున్నట్లుగా అర్చకులు రంగరాజన్ తెలిపారు. ఆయనకు బందోబస్తు సీఐ రాజు నిర్వహించారు.