ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకొన్నందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు ఆబ్కారీ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల మూడేండ్ల నిబంధనను రెండేండ్లకు తగ్గిస్తూ గతంలోనే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోగా.. దానికి సంబంధించి ఆబ్కారీశాఖలో తాజాగా జీవో విడుదలైంది. దీనిపై స్పందించిన మంత్రి.. త్వరలోనే టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపడుతామని పేర్కొన్నారు.