సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఎత్తిపోతలలో కీలకమైన భారీ రిజర్వాయర్ అయిన మల్లన్న సాగర్ జలాశయంలోకి నీటిని విడుదల చేయనున్నారు. ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా కాళేశ్వరం కాల్వ నుంచి జలాశయంలోకి అధికారులు నీటిని మళ్లించనున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలం తుక్కాపూర్ వద్ద పంప్హౌస్లో 8 భారీ మోటార్లను ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఐదు రిజర్వాయర్ల ద్వారా మలన్నసాగర్కు నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ ఏడాది మల్లన్న సాగర్లో పది టీఎంసీలు నిల్వ చేయనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతిపెద్దదైన మల్లన్నసాగర్ జలాశయంతో ఉమ్మడి మెదక్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలు సస్యస్యామలం కానున్నాయి. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 50 టీఎంసీలు.