హైదరాబాద్ : సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాల నిమిత్తం పదో తరగతి గ్రేడ్ల అప్లోడ్కు గడువు పొడిగిస్తున్నట్లు గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గ్రేడ్ల అప్లోడ్కు ఈ నెల 10 వరకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మార్కులు అప్లోడ్ చేయాలని సూచించారు. గ్రేడ్ల ఆధారంగా విద్యార్థులకు ఇంటర్లో ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు విద్యార్థులు www.tswreis.in వెబ్సైట్లో చూడాలని కోరారు. కరోనా నేపథ్యంలో టీఎస్ ఆర్జేసీ రద్దయిన నేపథ్యంలో పదో తరగతి గ్రేడ్ల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.