సిరిసిల్ల: జిల్లాలో మరో రెండు కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు సిరిసిల్లలోని జిల్లా ప్రధాన దవాఖానలో కరోనా టీకా పంపిణీ చేశారు. కొత్తగా వేములవాడ, ఎల్లారెడ్డిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో నేటి నుంచి ఈ కేంద్రాల్లో వ్యాకినేషన్ ప్రారంభిస్తున్నారు. అర్హులైన 60 ఏండ్లు పైబడినవారు, 45 నుంచి 59 ఏండ్ల వయస్సు కలిగి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ కేంద్రాల్లో టీకా తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ డాక్టర్ ఎ.సుమన్ మోహన్ రావు సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరు వినియోగించుకోవాలని కోరారు.