రాజన్న సిరిసిల్ల : రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వేములవాడ మూలవాగు వరద నీటి ప్రవాహంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. గురువారం ఉదయం వేములవాడ పట్టణానికి చెందిన 10 మంది వ్యక్తులు చేపల వేటకు వెళ్లారు. వరద ప్రవాహం ఎక్కువడంతో వాగు మధ్యలో ని ఒడ్డుకు చేరారు. గంట గంటకు వాగులో వరద నీటి ప్రవాహం పెరగడంతో మధ్యలోనే చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వేములవాడ పట్టణ సీఐ వెంకటేశ్ మూలవాగు వద్దకు వెళ్లి సహాయక చర్యలు అందిస్తున్నారు. గజ ఈతగాళ్లు తోపాటు తాడును వేసి బయటకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఆరు దశాబ్దాల సమస్యకు ఆరు నెలల్లోనే పరిష్కారం
దారుణం : భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
ఇసుక ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి
పార్లమెంట్ ముందు ఆందోళనకు భారీగా తరలివచ్చిన రైతులు..!
గ్రామాల అభివృద్ధి బాధ్యత మీదే : మంత్రి హరీశ్రావు