మేడ్చల్, మే 8 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్లోని ఆలయ భూముల వ్యవహారంలో ఐఏఎస్ల ప్రత్యేక విచారణ కమిటీ పక్కాగా ఆధారాలను సేకరించినట్టు తెలుస్తున్న ది. శ్రీసీతారామస్వామి ఆలయ భూ ములపై ఆధారాల సేకరణకు వివిధ విభాగాల అధికారులను కమిటీ ఇప్పటికే విచారించింది. ఆక్రమణదారుల గుర్తింపునకు ఆధారాలు లభించినట్టు సమాచారం. అనుమతుల్లేకుండా ఆల య భూముల్లో అక్రమంగా 160 గోదాములు, గెస్ట్హౌస్లు నిర్మించినట్టు అధికారులు ధ్రువీకరించారు. ఈ నిర్మాణాలకు ఏ ప్రాతిపదికన అనుమతి పొందిన విషయాలను పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్, మున్సిపల్, విద్యుత్తు అధికారుల నుంచి రాబట్టారు. దేవాదాయశాఖ రికార్డులను పరిశీలించారు. అక్రమ నిర్మాణాలపై చేయించిన సర్వే ఆధారంగా సర్వే నంబర్లను నిర్ధారించుకున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్రావు నేతృత్వంలో ప్రత్యేక విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి ఈటలపై వచ్చిన ఆరోపణల మేరకు దేవాదాయ భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కాకతీయుల కాలంలో లేదా 500 ఏండ్ల కిందట దేవరయాంజాల్లో శ్రీసీతారామస్వామి దేవాలయం నిర్మించినట్టు దేవరయాంజాల్ ప్రజలు చెప్తున్నారు. 1925లో నిజాం నవాబుల వద్ద ఇంజినీర్గా పనిచేసిన రామిడి పుల్లయ్యకు నిజాంలు సీతారామస్వామి పేరిట 91 సర్వే నంబర్లలో 1.525 ఎకరాల భూమి కేటాయించారు. ఆ భూమి పహాణీలో 1925, 26 సంవత్సరంలో శ్రీసీతారామస్వామి పేరిటే ఉన్నది. ఆ తర్వాత రికార్డులు లేకపోగా.. 1955, 56 సంవత్సరంలో రికార్డులు తారుమారు అయ్యాయి. సీతారామస్వామి పేరిట ఉన్న భూమి సీతారాంరెడ్డి పేరిట పహాణీలో నమోదైంది. ఇందులో దేవాదాయ భూములని ఉన్నప్పటికీ సీతారాంరెడ్డి పేరిట ఉన్న భూములకు సంబంధించి ఆ తర్వాత మరిన్ని పేర్లు పహాణీలో చేరాయి. అవి ఆలయ భూములేనని, రికార్డులు మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ వచ్చాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.