రాష్ర్టంలో క్రమంగా వేడెక్కుతున్న వాతావరణం

హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వాతావరణం క్రమంగా వేడెక్కుతున్నది. చాలా ప్రాంతాల్లో పగటి పూట 33 నుంచి 34 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. గురువారం మెదక్లో అత్యల్పంగా 15.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, భద్రాచలంలో 34.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయిందని చెప్పారు. మరోవైపు, ఉదయం వేళల్లో చలితీవ్రత ఇంకా కొనసాగుతున్నది. ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. రాగల మూడ్రోజుల వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది. శుక్ర, శనివారాల్లో పలుచోట్ల ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు, హైదరాబాద్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు కొంత ఉక్కపోతకు గురవుతున్నారు.
తాజావార్తలు
- ఒక్క మెడికల్ కాలేజీ, పసుపు బోర్డు తీసుకురాలేదు: మంత్రి ఎర్రబెల్లి
- టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్తే ఏషియా కప్ వాయిదా
- మళ్లీ కొలతూర్ నుంచే స్టాలిన్ పోటీ
- ఇస్రోతో దేశ ఖ్యాతి వర్ధిల్లుతున్నది : సీఎం కేసీఆర్
- దక్షిణ చైనా సముద్రంలో చైనా లైవ్ ఫైర్ డ్రిల్
- తమిళం నేర్చుకోనందుకు బాధగా ఉంది: మోదీ
- సింగరేణి కాలనీలో ఉచిత మల్టీ స్పెషాల్టీ వైద్య శిబిరం
- ఏడుగురు నకిలీ పోలీసుల అరెస్టు
- మార్చి 14 వరకు నైట్ కర్ఫ్యూ.. స్కూళ్లు బంద్!
- పెళ్ళిపై నోరు విప్పిన శ్రీముఖి..!