న్యూఢిల్లీ : కరోనా వైరస్ కాలంలో తమ ఉద్యోగులకు మరోసారి శుభవార్త చెప్పింది ప్రముఖ ఐటీ సంస్థ విప్రో సంస్థ. రెండోసారి జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు విప్రో యాజమాన్యం శనివారం ప్రకటించింది. ఉద్యోగుల జీతాలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరి నెలలోనే జీతాలు పెంచారు. సంస్థలోని 80 శాతం ఉద్యోగులు ఈ జీతాల పెంపు లబ్ది పొందనున్నారు. ఈ పెంపుదల 2021 సెప్టెంబర్ 1 నుంచి వర్తించనున్నదని విప్రో సంస్థ పేర్కొన్నది. ఇప్పటికే రెండు సార్లు జీతాల పెంపుదల నిర్ణయం తీసుకుని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ముందు వరుసలో ఉన్నది.
సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ జీతం పెంపుదల బ్యాండ్ 3 వరకు ఉన్న ఉద్యోగులకు వర్తించనున్నది. వీరిలో అసిస్టెంట్ మేనేజర్లు, వారి క్రింద ఉద్యోగులు ఉంటారు. జనవరి నెలలో కూడా 80 శాతం ఉద్యోగుల జీతం బ్యాండ్ 3 వరకు పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. అయితే, సీ 1 బ్యాండ్లోని అర్హతగల ఉద్యోగులు జూన్ నుంచి మెరుగైన జీతం పొందడం ప్రారంభిస్తారని విప్రో తెలిపింది. ఈ బృందంలో మేనేజర్స్, అంతకంటే ఎక్కువ స్థాయి ఉద్యోగులు ఉన్నారు. అత్యుత్తమ పనితీరు కనబరిచే ఉద్యోగులకు అధిక వేతనాల పెంపుతో పాటు రివార్డ్ ఇవ్వనున్నట్లు కంపెనీ పేర్కొన్నది.
2021 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలను విడుదల చేసిన విప్రో.. ఉద్యోగులను నిలబెట్టుకోవడానికి కంపెనీ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపింది. నాలుగో త్రైమాసికంలో విప్రో అట్రిషన్ రేటు (డ్రాపౌట్ రేటు) 12.1 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ క్యాంపస్ ద్వారా 10,000 మంది ఫ్రెషర్లను నియమించింది.
సుప్రీంకోర్టుకు విద్యార్థులు : ఆ ఫార్ములా సమానత్వ హక్కుల ఉల్లంఘనే..!
ఇవీ మిల్కాసింగ్ ఆరోగ్య సూత్రాలు..!
చరిత్రలో ఈరోజు : హిందుత్వానికి ప్రతీకగా శివసేన ఆవిర్భావం
కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా అమెరికా మరో అడుగు
కిడ్నీ క్యాన్సర్ ఎలా వస్తుందంటే..?
యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాకరణ
అంత్యక్రియల వేళ తల్లి మాట విని లేచిన కొడుకు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..