ముంబై: నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ముంబైలోని బ్రీచ్కాండీ హాస్పిటల్ నుంచి శనివారం డిశ్చార్జ్ అయ్యారు. గత మంగళవారం రాత్రి పవార్కు ఎండోస్కోపీ శస్త్రచికిత్స చేసి
ఆయన పిత్తవాహికలోని రాయిని వైద్యులు తొలగించారు. నాలుగు రోజుల వైద్యుల పర్యవేక్షణ అనంతరం తాజాగా ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. వారం రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఈ సందర్భంగా వైద్యులు సూచించారు. ప్రస్తుతం పవార్ ఆరోగ్యం బాగానే ఉందని, ఇంట్లోనే కోలుకుంటారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు.