హైదరాబాద్ సిటీ బ్యూరో/ముషీరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఎంత వయసు వచ్చినా నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి పేర్కొన్నారు. పుడమి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో నిర్వహించిన అబ్దుల్కలాం జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ముదుగంటి సుధాకర్రెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ముదుగంటి రచనలు సామాజిక స్ఫూర్తికి గీటురాళ్లుగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, అధ్యక్షుడు చిలుముల బాల్రెడ్డి పాల్గొన్నారు.