కామారెడ్డి టౌన్, మార్చి 25: ప్రైవే టు వాహనాల్లో ప్రయాణించే వారి భద్రత కోసం ప్యాసింజర్ వెహికిల్ డిజిటలైజేషన్ విధానాన్ని అమలు చేస్తామని ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. పట్టణ పోలీసు స్టేషన్ ఆవరణలో గురువారం వాహనదారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. క్యూఆర్ కోడ్ విధానంపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆటో, క్యాబ్ వంటి వాహనాలకు డిజిటల్ క్యూఆర్ కోడ్ విధా నం ప్రారంభించామని, జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1262 వాహనాలకు రిజిస్ట్రేషన్ పూర్తి చేశామని చెప్పారు. డిజిటల్ క్యూఆర్ కోడ్లు హాక్ఐ, ట్రేస్ కాప్ చాప్కు అనుసంధానం చేస్తామని, దీంతో ప్రయాణికులు ఉన్న వాహనం లొకేషన్ షేర్ అవుతుందని చెప్పారు. క్యూఆర్ కోడ్ SAFEAUTO TAXI .COM లో రిజిస్ట్రేషన్ అయిన వారికి యాక్సిడెంటల్ గ్రూప్ ఇన్సూరెన్స్ రూ.లక్ష వర్తిస్తుందని తెలిపారు. వాహనంలో ఏమైనా మర్చిపోయినా.. వాహన డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించినా.. ఆ వివరాలన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ రూంలో నమోదవుతాయని ఎస్పీ తెలిపారు.