శామీర్పేట, జూన్ 28 : యూట్యూబ్ చానల్ ముసుగులో మహిళను వేధిస్తున్న నిర్వాహకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 2020లో దమ్మాయిగూడకు చెందిన ఏ. పద్మజ, కౌషల్ త్యాగితో కలిసి యూట్యూబ్ చానల్ను ప్రారంభించారు.
అరుణ్కుమార్ త్యాగి అనే వ్యక్తి ఆఫీస్లో చానల్ కార్యకలాపాలు నిర్వహించారు. జనవరి18, 2021న కౌషల్ త్యాగితో అరుణ్కుమార్త్యాగికి గొడవలు జరుగడంతో కౌషల్ త్యాగి చానల్ను వదిలి వెళ్లిపోయాడు. ఆ రోజు నుంచి పద్మజ చానల్ బాధ్యతలను చేపట్టింది. అరుణ్కుమార్ త్యాగి ఆ రోజు నుంచి పద్మజను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. వేదింపులు తాళలేక ఏప్రిల్ 12, 2021న పద్మజ ఆఫీస్ను వదిలి వెళ్లిపోయింది.
అంతటితో ఆగని అరుణ్కుమార్ తన భార్యకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకుంటానని ఇబ్బందులకు గురిచేయసాగాడు. జూన్ 9న దమ్మాయిగూడలో పద్మజ తన సోదరుని ఇంటికి వెళ్తున్న క్రమంలో అరుణ్కుమార్ త్యాగి తన మిత్రుడైన కిరణ్ అనే వ్యక్తితో కలిసి పద్మజను పెళ్లి చేసుకోవాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా జూన్ 26న తన చెయ్యిని కట్చేసుకుని ఓ వీడియోను ఆమె ఫోన్కు పంపాడు. దీనికి నువ్వే కారణమని మరిన్ని వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో పద్మజ తనకు రక్షణ కల్పించాలంటూ బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.