తెలంగాణ విత్తన సంస్థకు ఉత్తమ అవార్డు

హైదరాబాద్ : దేశంలోనే ఉత్తమ విత్తన ధృవీకరణ సంస్థ అవార్డ్ను తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ అందుకుంది. ఇండియా సీడ్ అవార్డ్స్ లో విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత విత్తన ధృవీకరణలో నూతన సంస్కరణలతో తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ దేశంలో నంబర్ వన్ గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ సౌకర్యాలను, మౌలిక సదుపాయాలను కలిగిఉండి విత్తన దృవీకరణలో తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ దేశంలో ఒక రోల్ మోడల్గా నిలిచింది. దీనిపై రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారం దిశగా ప్రోత్సహించడానికి కావాల్సిన అన్ని రకాల చర్యలు చేపడుతూ ముందుకు పోవాలని ఆకాంక్షించారు. విత్తన ధృవీకరణ సంస్థ ఎండీకి మంత్రి అభినందనలు తెలిపారు.
తాజావార్తలు
- నగరంలో పలు అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
- రైతు సంఘాలతో కేంద్రం నేడు చర్చలు
- బాలానగర్ చెరువులో మృతదేహాలు
- గాజు సీసాలో జో బైడెన్..
- బెంగాల్లో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
- విజయవాడ హైవేపై బోల్తాపడ్డ లారీ.. భారీగా ట్రాఫిక్జాం
- నేడు ఉచిత ఆన్లైన్ జాబ్మేళా
- భూటాన్కు 1.5లక్షల డోసుల ‘కొవిషీల్డ్’ గిఫ్ట్
- నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల
- లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం