పోక్సో కేసుల పర్యవేక్షణకు టాస్క్ఫోర్స్: స్వాతి లక్రా

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆన్లైన్ వేధింపులు, లైంగికదాడి, పోక్సో కేసులపై మరింత దృష్టి పెట్టేలా చర్యలు చేపడుతున్నట్టు మహిళా భద్రత విభాగం అడిషనల్ డీజీ స్వాతిలక్రా ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న పోక్సో, లైంగికదాడి కేసుల్లో నిందితులకు సరైన శిక్ష లు పడేలా కేసుల దర్యాప్తు పక్కాగా జరిగేలా ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ టాస్క్ఫోర్స్ రాష్ట్రవ్యాప్తంగా నమోదైన లైంగికదాడి, పోక్సో కేసులపై ఆయా పోలీస్స్టేషన్ ఇన్వెస్టిగేషన్ అధికారులతో నిత్యం మాట్లాడుతుందని వివరించారు. కేసు నమోదైన నాటి నుంచి దర్యాప్తులో అనుసరించాల్సి పద్ధతులు, సకాలంలో మెడికల్ పరీక్షలు, నిందితుల అరెస్టు, కేసు దర్యాప్తు అశాలను ఈ టాస్క్ఫోర్స్ పర్యవేక్షిస్తుందని వివరించారు. క్షేత్రస్థాయిలో పని ఒత్తిళ్లు, కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. రేప్, పోక్సో కేసుల సత్వర దర్యాప్తే లక్ష్యంగా టాస్క్ఫోర్స్ పనిచేస్తుందని వివరించారు. బాధితులకు భరోసానివ్వడంతోపాటు ఆకతాయిల ఆగడాలపై నిరంతరం నిఘాపెట్టేందుకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నట్టు స్వాతిలక్రా తెలిపారు. రాష్ట్రంలోని అన్ని షీటీమ్స్వాట్సప్ నంబర్లతో ప్రత్యేకంగా ఒక గ్రూప్ రూపొందించారు. ఎవరైనా పోకిరీ వేధిస్తున్నట్టు బాధితురాలు వాట్సప్లో పోస్ట్ చేస్తే షీటీమ్స్ అలర్ట్ అవుతాయి. ఫిర్యాదు చేసే వారికి, షీటీమ్స్కు మధ్య సమాచార వినిమయం జరిగేలా సాఫ్ట్వేర్ను వారంలో అందుబాటులోకి తేనున్నారు. దీనిని పైలెట్ ప్రాజెక్టుగా నల్లగొండ, కరీంనగర్, సైబరాబాద్లోఅమలు చేయనున్నట్టు స్వాతిలక్రా తెలిపారు.
తాజావార్తలు
- అమెజాన్ ‘బ్లూ ఆరిజన్’ సక్సెస్
- ప్రజావైద్యుడు లక్ష్మణమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- ప్రభాస్ ‘సలార్’ లేటెస్ట్ అప్డేట్.. హీరోయిన్.. విలన్ ఎవరో తెలుసా?
- బెంగళూరు హైవేపై ప్రమాదం : ఒకరు మృతి
- వైద్య సిబ్బంది సేవలు మరువలేం : మంత్రి సబిత
- మన భూమి కంటే పెద్ద భూమి ఇది..!
- టీకా రాజధానిగా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్
- ‘శశి’ వచ్చేది ప్రేమికుల రోజుకే..
- టీకా సంరంబం.. కరోనా అంతం !
- పేదలకు ఉచితంగా టీకాలు ఇవ్వాలి: పంజాబ్ సీఎం