సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 9: కుల వృత్తులను నమ్ముకున్న వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీలో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో చేపల పంపిణీని ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఏడేండ్లుగా సీఎం కేసీఆర్ కుల వృత్తులకు పెద్దపీట వేస్తుండటంతో వృత్తిదారుల ఆత్మగౌరవం మరింత పెరిగిందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ్ల కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.