మహబూబ్నగర్ : ఆచార్య కొత్త పల్లి జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 87 వ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఉన్నజయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ స్ఫూర్తి, వారి భావ వ్యాప్తితోనే తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గుర్తించి ఎలాంటి రక్తపాతం లేకుండా గాంధేయ మార్గం ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ తెచ్చేందుకు ఆయన తోడ్పాటు అందించారని తెలిపారు.
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతుందన్నారు.
గత 7 సంవత్సరాలలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. గతంలో కరెంటు, తాగునీటికి కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానానికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు, తెలంగాణ ఉద్యమ కళా కారుల సంఘం అధ్యక్షులు వెంకటేష్, బాలచందర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు, రామలింగం, ఇతర ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
Tokyo Olympics: మెడల్పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్