ముంబై: ఐపీఎల్ సమీపిస్తున్న వేళ ముంబై ఇండియన్స్లో కరోనా వైరస్ కలవరం మొదలైంది. ఆ జట్టు బయోబ బుల్లో ఉన్న వికెట్ కీపింగ్ కన్సల్టెంట్, భారత మాజీ ప్లేయర్ కిరణ్ మోరే కరోనా బారిన పడినట్లు ముంబై ఫ్రాంచైజీ మంగళవారం వెల్లడించింది. వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలింది. ఇటీవలే 10 మంది స్టాఫ్ వైరస్బారిన పడడంతో తీవ్ర కలకలం రేగింది. కాగా ముంబైలో మ్యాచ్లు యథాతథంగానే జరుగనున్నాయి.