హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): అనుమతుల్లేని, ట్రిబ్యునల్ నుంచి ఎలాంటి కేటాయింపుల్లేని ప్రాజెక్టులకు నిధులు ఎలా సమకూరుస్తారంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్ర జల్శక్తిశాఖకు తెలంగాణ ఈఎ న్సీ మురళీధర్ శుక్రవారం లేఖ రాశా రు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా కృష్ణా జలాలను పెన్నా బేసిన్కు తరలించేందుకే ఉమ్మడి ఏపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును నిర్మించిందని తెలిపారు. దానికి జలవనరులశాఖ తదితర ఎలాంటి అనుమతుల్లేవ్వని వివరించారు. ఇటీవల విడుదల చేసిన గెజిట్లోనూ వెలిగొండను కేంద్రం అనుతుల్లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చిందని గుర్తుచేశారు. అయినా పీఎం కృషి సించాయ్ యో జనలో భాగంగా సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం ద్వారా నిధు లు కేటాయించాలని ఏపీ ఆ ప్రాజెక్టు ను ప్రతిపాదించిందని పేర్కొన్నారు. అనుమతుల్లేని ప్రాజెక్టులకు నిధులను సమకూర్చడం సరైందేనా? అనేదానిపై కేంద్రం మరోసారి పునరాలోచించుకోవాలని తెలంగాణ సర్కారు సూచించింది.