జయశంకర్ భూపాలపల్లి (నమస్తేతెలంగాణ) : విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, డిమాండ్ను తట్టుకునేలా నిరంతరం సరఫరా చేయాలని టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్లోని కాకతీయ థర్మల్ పవర్ప్లాంట్ (కేటీపీపీ) లో ఉద్యోగుల కోసం నిర్మించిన 430 క్వార్టర్ల సముదాయం, ఏసీహెచ్పీ కెమికల్ ల్యాబ్ బిల్డింగ్ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు.
అనంతరం కేటీపీపీలోని పలు విభాగాలను సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను సీఎండీ పరిశీలించారు. సర్వీస్ భవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్లాంట్లులో బొగ్గు నిల్వలు, తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ మేరకు అంతరాయం లేకుండా ఉత్పత్తి చేయాలని అన్నారు.
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్ను ప్రజలకు అందిస్తున్నదని అన్నారు. దానికి అనుగుణంగా టీఎస్ జెన్కో కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు సచ్చిదానందం, లక్ష్మయ్య, సీఈ సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Good news | ప్రవేశ పరీక్ష లేకుండానే ‘ఇగ్నో’లో ఎంబీఏ
మనం మాస్కులు ఇంకా ఎన్ని రోజులు పెట్టుకోవాలి.. ప్రభుత్వం మాట ఇదీ!
రైతులు, కూలీలను ఆప్యాయంగా పలుకరించిన మంత్రి కేటీఆర్