వరంగల్ అర్బన్ : వరంగల్ పశ్చిమ నియెజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్తో కలిసి వరంగల్ పశ్చిమ నియెజకవర్గ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ.. వరంగల్ నగరంలో పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వర్షకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. హన్మకొండలో కార్మిక భవన్, ఆటో భవన్ నిర్మాణం కోసం సరైన స్థలాన్ని కేటాయించాలని కోరారు. బోడగుట్ట నుంచి దర్గా వరకు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రణాలికను రూపొందించాం. రెవెన్యూ కాలనీలో బరియల్ గ్రౌండ్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కోసం కూడా స్థలం కేటాయించాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి..
పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
జమ్మికుంటలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’
అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి
పరిగిని సుందరంగా తీర్చిదిద్దుదాం
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వీసీ సీతారామారావు
తెలంగాణ.. రైతు సంక్షేమ రాష్ట్రం : మంత్రి పువ్వాడ