కుంట మధ్యలో నుంచి రోడ్డు ఏర్పాటు
చర్యలు తీసుకోవాలని రైతుల ఫిర్యాదు
దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 17 : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టేందుకు వీలైన చోట్ల చెక్డ్యాంలు నిర్మిస్తున్నది. చెక్డ్యాంలో నీరు నిలువ ఉంటే భూగర్భజలాలు పెంపొందుతాయనే ఉద్దేశంతో వాటి నిర్మాణాని కి శ్రీకారం చుడుతున్నది. అయితే, కొందరు అక్రమార్కుల కారణంగా చెక్డ్యాంలు మాయమవుతున్నాయి. దేవరకద్ర మండలంలోని ఇస్రంపల్లి గ్రామ సర్వే నంబర్ 45లో ఉన్న 90 ఎకరాల ప్రభుత్వ భూమిని దళితులు, పేదలకు 1985 లో పంపిణీ చేసింది. అయితే, ఆ భూమికి వరద వచ్చే వంపు లు ఉండడంతో చెక్డ్యాం నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొందరు గ్రామస్తులు స్వార్థం కోసం చెక్డ్యాం కట్ట ను తెంపి ఏకంగా కుంట మధ్యలో నుంచి రోడ్డు వేశారు. కుం టలోని మట్టిని తొలగించి సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ఇదేంటని అడిగిన ఆయకట్టు రైతులకు నిర్లక్ష్యంగా స మాధానమిస్తున్నారు. చెక్డ్యాంను తొలగించాలని మధ్యలో రోడ్డు వేశారని, ఈ విషయంపై అధికారులు, కలెక్టర్కు ఫి ర్యాదు చేసినట్లు ఇస్రంపల్లి సర్పంచ్ శివరాజు తెలిపారు.