పేదల బస్తీలు రూపురేఖలు మార్చుకుని ఆత్మ గౌరవంతో తలెత్తుకొని నిలబడుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకంతో మెరిసిపోతున్నాయి. అడిక్మెట్ డివిజన్ సాయిచరణ్ బస్తీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు గురువారం ప్రారంభం కానున్నాయి. అడిక్మెట్ డివిజన్ సాయిచరణ్ కాలనీలో నివాసం ఉంటున్న 108 మంది లబ్ధిదారుల కోసం జీ ప్లస్ 9 అంతస్తులతో భవనాన్ని 93420 చదరపు అడుగుల్లో రూ.9.34 కోట్లతో నిర్మించారు.