ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఆయన పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు 200 మంది కార్యకర్తలు జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ ఆధ్వర్యంలో మంత్రి పువ్వాడ సమక్షంలో ఇవాళ టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించి మాట్లాడారు. పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని అన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని అన్నారు.