హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): దసరా పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 4,035 ప్రత్యేక బస్సు సర్వీస్లను నడుపుతున్న టీఎస్ఆర్టీసీ ప్రయాణికుల కోసం మరో సేవను అందుబాటులోకి తెచ్చిం ది. ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేకంగా కాల్ సెంటర్లను ఏర్పాటుచేసినట్టు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 040-68 153333, 040-30102829 నంబర్లలో ప్రయాణికులు వారికి కావాల్సిన సమాచారం అడిగి తెలుసుకోవచ్చని తెలిపారు. వీటికి అదనంగా బస్ స్టేషన్లవారీగా నంబర్లను అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు.