హుజూరాబాద్, జూన్ 15: మాజీ మంత్రి ఈటల రాజేందర్కు రాజకీయంగా సీఎం కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చినా దురాశకు పోయారని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ విమర్శించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని సిటీ సెంటర్ హాలులో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరై, మాట్లాడారు. సీఎం కుర్చీపై వ్యామోహం పెంచుకున్న ఈటల రాజకీయ నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలోనే ఆర్య వైశ్యులకు తగిన ప్రాధాన్యత లభించిందన్నారు. వచ్చే ఉప ఎన్నికలో ఆర్యవైశ్యులు ఒక్కతాటిపైకి వచ్చి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు.