భోపాల్: రైల్వే స్టేషన్లోని తాగు నీటి ట్యాంక్కు టాయిలెట్ పైప్ అటాచ్ చేశారు. ఒక ప్రైవేట్ వర్కర్ చేసిన పొరపాటుకు రైల్వేస్టేషన్ మాస్టర్పై సస్పెన్షన్ వేటు పడింది. మధ్యప్రదేశ్లోని మాండ్సౌర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కోటా రైల్వే డివిజన్ పరిధిలోని గారోత్ స్టేషన్లో ప్రైవేట్ సంస్థకు చెందిన ఒక పారిశుద్ధ్య కార్మికుడు టాయిలెట్ పైప్లైన్ను తాగు నీటి ట్యాంకుకు కలిపాడు. ఈ విషయాన్ని గమనించిన కొందరు ప్రయాణికులు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
రైల్వే అధికారులు దీనిపై స్పందించారు. ఆ పారిశుద్ధ్య కార్మికుడ్ని విధుల నుంచి తొలగించామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టేషన్ మాస్టర్ చౌత్మల్ మీనాను సస్పెన్షన్లో ఉంచామని పశ్చిమ సెంట్రల్ రైల్వే ఈ నెల 5న తెలిపింది. ఆ వాటర్ ట్యాంకును పూర్తిగా శుభ్రం చేసి తాగు నీటి వినియోగానికి అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.