హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పూర్తిస్థాయి బోర్డు మీటింగ్ను ఈ నెల 12న నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు లేఖలు రాయనున్నట్టు తెలిసింది. ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన సీమ ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం జరుపాలని ఇరు రాష్ర్టాలకు గతంలోనే లేఖలు రాసింది. దీనిపై తెలంగాణ స ర్కారు అభ్యంతరం తెలిపింది. కేఆర్ఎం బీ పరిధిలోని అన్ని ప్రాజెక్టుల సీఈలు, అధికారులతో జూలై 20 తర్వాత బోర్డు మీటింగ్ ఏర్పాటుచేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో లేఖ రాసింది.