హాంకాంగ్, మే 28: హాంకాంగ్ మీడియా దిగ్గజం, ప్రజాస్వామ్యవాదిగా పేరున్న జిమ్మీ లై కి అక్కడి ప్రభుత్వం 14 నెలల జైలు శిక్ష విధించింది. హాంకాంగ్కు రాజకీయ స్వాతంత్య్రం కల్పించాలని కోరుతూ, తమపై చైనా పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ 2019లో జరిగిన నిరసన కార్యక్రమాలు, అల్లర్లలో ఆయన పాత్ర ఉన్నట్టు తేలడంతో జిమ్మీకి శిక్ష ఖరారైంది. ఈ కేసులో ఆయనతో పాటు మరో తొమ్మిది మందికి కూడా జైలు శిక్ష పడింది. అల్లర్ల కేసుకు సంబంధించి జిమ్మీకి గతంలోనూ 14 నెలల జైలు శిక్ష ఖరారవడంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆయన జైళ్లోనే ఉన్నారు.