మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ తన దూకుడు కొనసాగిస్తున్నారు. చివరిగా దృశ్యం2 చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన ఆయన ప్రస్తుతం భారీ ఎపిక్ పాన్ ఇండియన్ చిత్రం “మరక్కార్”లో నటిస్తున్నారు. అరేబియన్ సముద్రానికి లయన్ గా పిలవబడే మరక్కర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాపై మళయాళ ప్రేక్షకులు అయితే ఎన్నో అంచనాలు పెట్టుకొని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆగస్ట్ 12న మరక్కార్ చిత్రాన్ని విడుడల చేయాలని భావించారు మేకర్స్. కాని కరోనా వలన పరిస్థితులు పూర్తిగా తారు మారు కావడంతో రిలీజ్పై సందేహాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు కరోనా కాస్త శాంతించడంతో మూవీని ఆగస్ట్ 12న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఆగష్టు 12 కే తమ ఈ భారీ చిత్రాన్ని విడుదల చెయ్యాలనే ఎట్టి పరిస్థితుల్లో అనుకుంటున్నామని మీ అందరి ప్రార్ధనలు మరియు సపోర్ట్ తోనే అది సాధ్యం కావాలని కోరుకుంటున్నట్టుగా మోహన్ లాల్ తన ఎపిక్ సినిమాపై క్లారిటీ ఇచ్చేసారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, కళ్యాణి ప్రియదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు.