కరోనా కట్టడికి మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం ఒక్కటే సరిపోదు ! వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా అవసరమే !! అందుకే ముంబై వీధుల్లో తిరుగుతూ పరిసరాలను శానిటైజ్ చేశాడు మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త అశోక్ కుర్మి. ఈ క్రమంలో కరోనా నుంచి తనను తాను రక్షించుకోవడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నిండుగా స్పైడర్మ్యాన్ డ్రెస్ వేసుకున్నాడు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 67,468 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
నైట్ కర్ఫ్యూ.. రోడ్లన్నీ నిర్మానుష్యం
ఎదురెక్కిన గోదారి.. పరవళ్లు తొక్కిన మానేరు