న్యూఢిల్లీ, జూన్ 22: గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయనివారికి పన్ను భారం ఎక్కువకానుంది. జూలై1 నుంచి వారి వేతనాలు, ఆదాయంలో టీడీఎస్ (టాక్స్ డిడెక్టడ్ ఎట్ సోర్స్) అధికంకానుంది. ఈ ఏడాది బడ్జెట్లో ఈ అంశాన్ని ప్రతిపాదించగా, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజాగా సర్క్యులర్ను జారీచేసింది. ఎవరివద్ద నుంచి ఎక్కువ టీడీఎస్ వసూలు చేయాలో, ‘ఆ వ్యక్తుల్ని’ టీడీఎస్ డిడెక్టర్లు, టీసీఎస్ కలెక్టర్లు గుర్తించేందుకు కొత్తగా ఒక యుటిలిటీని రూపొందించినట్లు సీబీడీటీ తెలిపింది.
వీరికి టీడీఎస్ ఎక్కువ