హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గడంతో అన్ని రకాల లాక్డౌన్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేశారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,362 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకున్న మరో 1,813 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,568 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే లక్ష 23వేల 5 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.