హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,197 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 9 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 137 మందికి పాజిటివ్గా తేలింది. 24 గంటల్లో 1,707 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 5,93,577కు చేరింది. ప్రస్తుతం 17,246 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 1,19,537 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.