హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 808 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు మరణించారు. కరోనా మహమ్మారి నుంచి 1,061 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ర్టంలో ప్రస్తుతం 11,704 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇవాళ 1,03,398 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.