హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం రికార్డుస్థాయిలో డిశ్చార్జిలు నమోదయ్యాయి. ఒక్కరోజే 6,361 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. దీంతో మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 4.62 లక్ష లు దాటింది. రాష్ట్రంలో రికవరీ రేటు 88.91 శాతానికి పెరుగగా.. జాతీయ సగటు 83.4 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో కొత్తగా 4,305 మందికి పాజిటివ్గా తేలింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 607, రంగారెడ్డిలో 293, మేడ్చల్ మల్కాజిగిరిలో 291, నల్లగొండలో 246, కరీంనగర్లో 229 కేసులు వెలుగుచూశాయి. కరోనా, ఇతర కారణాల వల్ల 29 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 54 వేలకు తగ్గింది. శుక్రవారం మధ్యాహ్నానికి రాష్ట్రవ్యాప్తంగా 24,990 పడకలు అందుబాటులో ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది.