హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎడ్సెట్-2021 నోటిఫికేషన్ విడుదల ఆలస్యం కానున్నది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదల చేయాల్సి ఉన్నది. కానీ, పలు సాంకేతిక సమస్యలు తలెత్తడం, షెడ్యూల్లో మార్పులుచేయడం వల్ల విడుదలను ఉపసంహరించారు. వారంరోజుల్లోగా కొత్త షెడ్యూల్తో నోటిషికేషన్ను విడుదల చేస్తామని కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు.