ఖైరతాబాద్, ఆగస్టు 4: రాష్ర్టాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులపై అన్పార్లమెంటరీ భాష వాడుతూ అవమానిస్తున్న తీన్మార్ మల్లన్న వైఖరి మార్చుకోవాలని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు హితవు పలికారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఉద్యమ పత్రిక నమస్తే తెలంగాణను అవమానపర్చటం మానుకోవాలని మల్లన్నకు స్పష్టంచేశారు. మున్నూరుకాపు సంఘం యువజన విభాగం అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ మల్లన్న పద్ధతి మార్చుకోకపోతే బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సమావేశంలో తలారి చైతన్య, శ్రీనివాస్చారి, మోహన్నాయక్, యాకయ్య, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.