రాష్ట్రంలో 9 యూనివర్సిటీలకు రూ.551 కోట్లు కేటాయించారు. అత్యధికంగా ఉస్మానియా వర్సిటీకి రూ.353.89 కోట్లు.. ఆ తర్వాత కాకతీయ వర్సిటీకి రూ.90.93 కోట్లు, బీఆర్ఏవోయూకు రూ.11.94 కోట్లు, పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీకి రూ.28 కోట్లు, హిందీ అకాడమీకి రూ.21.74 కోట్లు, తెలంగాణ వర్సిటీకి రూ. 27.17 కోట్లు, మహాత్మాగాంధీ వర్సిటీకి రూ. 22.28 కోట్లు, శాతవాహన వర్సిటీకి రూ.9.95 కోట్లు, పాలమూరు వర్సిటీకి రూ. 7.78 కోట్లు కేటాయించారు. ఇవన్నీ జీతాలు చెల్లించేందుకే కావడం గమనార్హం. యూజీసీ ఇచ్చే నిధులు, ఫీజుల ద్వారా వచ్చే ఆదాయానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం సై తం బడ్జెట్లో నిధులను మంజూరుచేస్తున్నది. ఉన్నత విద్య సచివాలయ శాఖకు రూ.13.25 కోట్లు, తెలుగు అకాడమీకి రూ.11.14 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి రూ. 33.22 కోట్లు, సైన్స్ అకాడమీకి రూ. 12.91 కోట్లు, రూసాకు రూ. 22.64 కోట్లు కేటాయించారు.
బడ్జెట్లో మధ్యాహ్న భోజన పథకానికి రూ.609. 32 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ స్కూళ్లతోపాటు మదర్సాలు, ఎన్సీఎల్పీ పథకంలో నడుస్తున్న పాఠశాలల్లోని 22.05 లక్షలమంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నారు. బియ్యం, కోడిగుడ్లు, వంటఖర్చుకు నిధులను వెచ్చిస్తారు.
వయోజన విద్య పరిధిలో అమలుచేస్తున్న పఢ్నా లిఖ్నా అభియాన్కు రూ. 6.5 కోట్లు కేటాయించారు. 2011 జనాభా లెక్కల్లోని అక్షరాస్యత ప్రకారం తెలంగాణలోని ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్భూపాలపల్లి జిల్లాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. ఈ జిల్లాల్లో 15 ఏండ్లు దాటినవారికి అక్షరాస్యత కార్యక్రమాలను అమలుచేయనున్నారు. .
ఆలయాల అభివృద్ధి, అర్చకుల సంక్షేమానికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. బడ్జెట్లో దేవాదాయశాఖకు ప్రత్యేకంగా రూ.720 కోట్లు కేటాయించడం గొప్ప విషయం. గ్రామీణ ఆలయాల మాదిరిగానే పట్టణ ప్రాంతాల్లోని ఆలయాల్లో కూడా ధూపదీప నైవేద్య పథకం అమలుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. దీనిద్వారా ఎన్నో బ్రాహ్మణ కుటుంబాలు ఆర్థిక ప్రగతి సాధిస్తాయని భావిస్తున్నాం.
-దౌలతాబాద్ వాసుదేవశర్మ, ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
పాడి రైతులకు ప్రోత్సాహకం అందించేందుకు రూ.76 కోట్లను ప్రతిపాదించారు. ప్రతి లీటరుపై ఇప్పటికే ప్రభుత్వం రూ.5 ప్రోత్సాహకం ఇస్తున్నది. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 2,89,969 లీటర్లు సేకరిస్తున్నారు. నేడు తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ సమృద్ధితో కళకళలాడుతున్నది. రైతుల ముఖాల్లో ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతున్నది. ఇది శుభపరిణామం. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతుల కన్నీరు తుడవకపోగా, కరెంటు అడిగితే కాల్చి చంపాయి. రైతులు హిస్టీరియాతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎక్స్గ్రేషియా కోసం చనిపోతున్నారంటూ అవహేళన చేశాయి. స్వరాష్ట్రంలో కేసీఆర్ వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేశారు.
– బడ్జెట్ ప్రసంగంలో హరీశ్రావు