హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం గత ఏడేండ్లలో ప్రతి రంగంలోనూ దాదాపు వం దశాతం వృద్ధి సాధించింది. కొన్ని రంగాల్లో ఏకంగా ఐదా రు రెట్లు వృద్ధి నమోదైంది. కరోనా విపత్తు దెబ్బకొట్టినా.. ‘తగ్గేదే..లే’ అంటూ దూసుకుపోతున్నది. తాజాగా, కేంద్రం విడుదల చేసిన ‘అర్థ్నీతి’లో సైతం రాష్ట్ర అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావించింది. టీఎస్ ఐపాస్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు, సాగునీటి ప్రాజెక్టులను అభినందిస్తూనే, వాటి ఫలితాలను వివరించింది.
ఆగస్టులోనూ అదే జోరు
కరోనా సెకండ్ వేవ్ దెబ్బ నుంచి రాష్ట్ర ఆర్థికరంగం క్రమంగా కోలుకుంటున్నది. ఆగస్టులోనూ రాష్ట్ర ఆదాయం రూ.10 వేల కోట్లు దాటింది. వరుసగా మూడు నెలలు రూ.10 వేల కోట్ల మార్క్ దాటుతుండటం విశేషం. సాధారణంగా నెలకు రాష్ట్ర ఆదాయం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ రెవెన్యూ, సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర మార్గాల్లో కలిపి కనీసం రూ.10-11 వేల కోట్లు ఉంటుంది. అయితే సెకండ్ వేవ్, లాక్డౌన్ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లో ఆదాయం ఆశించినంతగా రాలేదు.
ముఖ్యంగా మే నెలలో లాక్డౌన్తో రాబడి గణనీయంగా తగ్గింది. జూన్లో లాక్డౌన్ ఎత్తివేయడం, ఆర్థిక కార్యకలాపాలు మొదలు కావడంతో వ్యవస్థ తిరిగి పట్టాలెక్కింది. మొదటిసారిగా జూన్ నెలలో ఆదాయం రూ.10,222 కోట్లుగా నమోదైంది. దీనిని కొనసాగిస్తూ జూలై, ఆగస్టు నెలల్లోనూ ఆదాయం రూ.10 వేల కోట్లు దాటింది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే దళిత బంధుకు రూ.2 వేల కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు జీఎస్టీ వసూళ్లలోనూ వృద్ధి నమోదైంది. ఆగస్టులో రూ.3,526 కోట్లు వసూలయ్యాయి. గతేడాది ఆగస్టులో రూ.2,793 కోట్లు రాగా, ఈసారి 26 శాతం వృద్ధి నమోదైంది.