అంబర్పేట, జూన్ 1: అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని బస్తీలను అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇప్పటికే చాలా బస్తీల్లో సీసీ, వీడీసీసీ రోడ్ల నిర్మాణం, తాగునీరు, డ్రైనేజీ పైప్లైన్లను చేపట్టినట్లు తెలిపారు. అంబర్పేట డివిజన్లోని పటేల్నగర్, బిలాల్ మసీద్, అహ్మద్నగర్, నరేంద్రనగర్ న్యూపటేల్నగర్ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్తో కలిసి పాదయాత్ర చేశారు. ప్రజల నుంచి పలు సమస్యలు తెలుసుకున్నారు. ప్రధానంగా తాగునీటి లోఫ్రెషర్, కలుషిత తాగునీటి సరఫరా, డ్రైనేజీ ఓవర్ఫ్లో, వీధిలైట్లు, రోడ్డు ప్యాచ్వర్క్ సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన వెంటనే జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
అంబర్పేట డివిజన్లో చాలా బస్తీలు ఉన్నాయని, వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కరోనా పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా కరోనా సోకి ఇబ్బందులు పడుతుంటే తనకు తెలియజేస్తే తగిన సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పారు. కరోనా వైరస్ సోకి ఇండ్లలో ఉండటానికి ఇబ్బందులు పడుతున్న వారికోసం లకోటియా ప్రభుత్వ పాఠశాలలో ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సంతోష్, ఏఈ శ్వేత, జలమండలి మేనేజర్ కుశాల్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు దయాకర్యాదవ్, సలీం, మహేశ్ముదిరాజ్, సమోసా మోసిన్, మహ్మద్గౌస్, షనుర్, ఆదిల్, హైమద్, గౌస్, రంగు ఉదయ్గౌడ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.