శ్రీశైలం : శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర కమర్షియల్ ట్యాక్సెస్ కమిషనర్ నీతుప్రసాద్ ఐఏఎస్ దంపతులు, హైదరాబాద్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డీఐజీ ఎంకే సింగ్ దంపతులు దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం క్షేత్రానికి వచ్చిన వారికి ప్రధాన గోపురం వద్ద ఈవో లవన్న, అర్చక వేదపండితులతో కలిసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉభయ దేవాలయాల్లో స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. స్వామివారికి బిల్వార్చన స్పర్శదర్శనం చేసుకుని అమ్మవారికి కుంకుమార్చనలు చేసుకున్నారు. అనంతరం ప్రాకార మండపంలో వేదపండితులు వేదాశీర్వచనాలు చేసి స్వామిఅమ్మవార్ల ఙ్ఞాపిక, పరిమళ విభూధి, తీర్థప్రసాదాలు ఇచ్చారు.