హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): మినీ పురపోరులోనూ గులాబీ హవా కొనసాగుతుందని టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొవటమే కాదు.. జెండా ఎగురవేసి తీరుతామని ధీమాతో ఉన్నాయి. ‘హైదరాబాద్’, ‘నల్లగొండ’ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయబావుటా ఎగురవేసిన గులాబీ శ్రేణులకు ఆ విజయం స్ఫూర్తి తగ్గకముందే నాగార్జునసాగర్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడింది. సాగర్ ఉపఎన్నిక ప్రచారం చివరిరోజే వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు ఐదు ము న్సి పాలిటీల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీకావడంతో మరోసారి ఎ న్నికల సమరానికి గులాబీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. తెలంగా ణ ఆవిర్భావం అనంతరం పట్టణాల్లోని జీవన ప్రమాణస్థాయిని పెంచటం, మౌలిక సదుపాయాలు కల్పించడంలో దేశంలోనే ఆదర్శంగా రాష్ట్రం సాగుతున్నది. ఇవి పట్టణ ఎన్నికల్లో తమ కు అదనపు శక్తినిస్తాయని టీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి.
ఆశావహుల పోటాపోటీ
తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో రాజకీయ శక్తుల పునరేకీకరణ జరిగింది. సీఎం కేసీఆర్పై నమ్మకంతో వివిధ పార్టీలకు చెందిన అన్ని స్థాయిల ముఖ్యనేతలు, అనుచరులు, పెద్ద సం ఖ్యలో కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు. కొత్త, పాత మేలు కలయికగా వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నేతలు కలిసికట్టుగా ముందుకు సాగుతుండటంతో ప్రజారంజక రాజకీయ వాతావరణం నెలకొన్నది. అన్ని నగరాలు, పట్టణాల్లో టీఆర్ఎస్ టికెట్ వస్తే చాలు తాము గెలిచినట్టే అనే భావన నెలకొన్నది. ఫలితంగా ఆశావహుల మధ్య పోటీ పెరిగింది. అదే సమయంలో ఒక స్నేహపూర్వక వాతావరణం కూడా టీఆర్ఎస్లో కనిపిస్తున్నది. టికెట్ కోసం ఎంతమం ది పోటీ పడినా.. దక్కేది ఒక్కరికేనని, అది ఎవరికి వచ్చినా.. అంతా కలిసి కట్టుగా తమ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు పనిచేస్తామని పార్టీ శ్రేణులు చెప్తుండటం విశేషం.
అభివృద్ధి బలం.. ప్రజాదీవెన
అటు కార్పొరేషన్లు, ఇటు మున్సిపాలిటీల రూపురేఖలను గడిచిన ఆరున్నరేండ్లలో ప్రభుత్వం మార్చివేసింది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణాలన్నీ అద్దంలా మెరుస్తున్నాయి. అభివృద్ధి కండ్లముందే కనిపిస్తున్నది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో కనీవినీ ఎరుగనిరీతిలో మున్సిపాలిటీలు ఆదర్శంగా రూపుదిద్దుకున్నాయి. ఇవే తమను గెలిపిస్తాయని టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు.
ద్విదశాబ్ది కానుక..
పల్లె.. పట్నం అన్న తేడా లేకుండా ప్రజలంతా టీఆర్ఎస్ వెన్నం టే ఉన్నారని అనేక సందర్భాలు రుజువుచేశాయి. తాజాగా పట్టణ పోరులోనూ తమదే గెలుపుని చెప్తున్న పార్టీ శ్రేణులు.. టీఆర్ఎస్ రెండు దశాబ్దాల ఆవిర్భావ ఉత్సవాలకు సన్నద్ధమవుతున్న తరుణంలో వచ్చిన ఈ ఎన్నికలు తమకు మరింత ప్రత్యేకంగా భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి, గులాబీ రథసారథి కేసీఆర్కు భారీ విజయాన్ని కానుకగా ఇవ్వాలని భావిస్తున్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించటమే కాకుండా సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్న కేసీఆర్కు గులాబీ విజయ తిలకం దిద్దటానికి పార్టీ శ్రేణులు కంకణం కట్టుకుంటున్నాయి.