హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ ముదిరాజ్ నాయకులారా ఇప్పుడు మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.. మీరెటువైపు ఉంటారు? మాజీ మంత్రి ఈటల రాజేందర్ వైపా? లేక నిరుపేద ముదిరాజ్ వైపు ఉంటారా? తేల్చుకోవాలని ముదిరాజ్ మహాసభను ఒక సగటు ముదిరాజ్ బిడ్డగా అడుగుతున్నాను అంటూ వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్ ప్రశ్నించారు. భూ ఆక్రమణదారుడిగా మారిన ఈటల రాజేందర్ వైపు ఉంటారా? పేద ముదిరాజ్ బిడ్డ పీట్ల మహేశ్ వైపు ఉంటారా? తేల్చుకోవాలని సూచించారు. ‘తమ భూమిని మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబం కబ్జా చేసిందని మేడ్చల్ మండలం రావల్కోల్కు చెందిన పీట్ల మహేశ్.. సీఎం కేసీఆర్కు ఫిర్యాదుచేసిన విషయాన్ని కోట్ల మహిపాల్ గుర్తుచేశారు. ఇటువంటి పరిస్థితిలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ పేద ముదిరాజ్ బిడ్డ పీట్ల మహేశ్ వెంట ఉండే అవకాశం లేదా అని ప్రశ్నించారు. వెంటనే ఒక ఉప సంఘాన్ని నియమించి నిజానిజాలు తేల్చేందుకు క్షేత్రస్థాయికి వెళ్లి మహేశ్కు రక్షణగా నిలిచి ముదిరాజ్ మహాసభ తన నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. నేడు రాష్ట్రమంతా తమ వైపే చూస్తున్నదని, జాగ్రత్తగా వ్యవహరించకపోతే మనం జాతికి నష్టం చేసిన వాళ్లమ వుతామని జడ్పీటీసీ కోట్ల మహిపాల్ పేర్కొన్నారు.