ఖలీల్వాడి, ఫిబ్రవరి 22: వర్గీకరణ పేరుతో బీజేపీ మాదిగలతో నాటకమాడుతున్నదని టీఎస్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా లోక్సభ ఎన్నికల్లోపే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. గురువారం నిజామాబాద్లో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిం చాలని కోరారు.