కరీంనగర్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): లాక్డౌన్ నిబంధనలు పాటించని ఆకతాయిల ఆట కట్టించేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సరికొత్త వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. రామగుండం, పెద్దపల్లి, మంథని, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ల పరిధిలో గురువారం పదిగంటల తరువాత రోడ్లపైకి వచ్చిన 163 మందిని పట్టుకున్నారు. ‘ఐసొలేషన్కు తరలింపు వాహనం’ అనే ఫ్లెక్సీలు కట్టిన వాహనాల్లో వారిని స్టేషన్లకు తరలించారు. కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మళ్లీ రోడ్లపైకి వస్తే ప్రత్యేక ఐసొలేషన్ కేంద్రాలకు తరలిస్తామని హెచ్చరించారు.